ఏఎన్‌యూ ఈసీ సభ్యుడిగా నాతాని వెంకటేశ్వర్లు

నరసరావుపేట కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ నాతాని వెంకటేశ్వర్లు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి (ఈసీ) సభ్యుడిగా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తానని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.