AP: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో తల్లికి వందనం కింద విద్యార్థికి రూ.13వేల చొప్పున నగదును తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గతేడాది ఆధార్ లింక్ కాకపోవడంతో చాలా మంది ఈ స్కీమ్కు దూరమయ్యారు.
అలాంటి ఇబ్బందులు రిపీట్ కాకుండా ముందస్తుగా బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
దాంతో పాటు బ్యాంకుకు వెళ్లి NPCI మ్యాపింగ్ చేసుకోవాలి.


